తిరుమలలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు.. సుప్రీంకోర్టు సిట్ పై కీలక వ్యాఖ్యలు

ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలతో తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది.

Update: 2024-10-06 11:27 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలతో తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే విషయంపై మాజీ కేంద్ర మంత్రి సుబ్రమన్యస్వామి సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా.. విచారించిన కోర్టు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ను రద్దు చేసి.. సుప్రీమ్ కోర్టు ఆధ్వర్యంలో మరో సిట్ ను ఏర్పాటు చేసింది.

ఇదిలా ఉంటే.. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్.. లడ్డు వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిజం నిగ్గు తేల్చాలని కోరారు. అలాగే భక్తుల మనోభావాలు, విశ్వాసాలు కాపాడాలని తాను కోరుకున్నట్లు ఎంపీ రఘునందన్ వెల్లడించారు.


Similar News