Nellore: ప్రభుత్వ భూమి ఆక్రమణ.. ఉద్రిక్తత

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం ధర్మవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది...

Update: 2024-08-15 07:04 GMT

దిశ, వెబ్ డెస్క్:  నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం ధర్మవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు ఓ వర్గం ప్రయత్నం చేసింది. అయితే ఈ ప్రయత్నాలను మరో వర్గం అడ్డుకుంది. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాట పెరిగి ఘర్షణకు దిగారు. పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. గ్రామంలో భారీగా మోహరించారు. మళ్లీ ఆందోళనలు చెలరేగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. 

Tags:    

Similar News