AP Politics:మాజీ సీఎం జగన్‌పై సీపీఐ నేత సంచలన వ్యాఖ్యలు..!

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందిన సంగతి తెలిసిందే.

Update: 2024-07-02 09:42 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల సమయంలో వై నాట్ 175 స్థానాల్లో విజయం మాదేనని ధీమా వ్యక్తం చేసిన వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. తాజాగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రజలు జగన్ పై తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని ఎప్పుడో చెప్పానని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో స్పష్టమైన వైఖరి అవసరమని నారాయణ అన్నారు. ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ విషయాన్ని వైఎస్ జగన్ తెలుసుకోలేకపోయారు అని తెలిపారు. బీజేపీ పట్ల జగన్ న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడం వల్లే వైసీపీ తీవ్రంగా నష్టపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. అభివృద్ధి పనులు మరిచి సంక్షేమం ఒక్కటే చాలని భావించారని విమర్శించారు.

Similar News