AP News:మదనపల్లె సబ్ కలెక్టరేట్లో సీన్ రీకన్స్ట్రక్షన్
మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్బ్యూరో:మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను అత్యంత సీరియస్గా తీసుకున్న సర్కార్.. అగ్నిప్రమాదమా? కుట్రపూరితమా? అనే కోణంలో విచారణ చేయాలని ఆదేశించింది. ఈ విచారణను సీఐడీ అధికారులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. మదనపల్లి కలెక్టరేట్లో తెల్లవారుజామున మూడు గంటల వరకు సీఐడీ తనిఖీలు నిర్వహించారు.ఫైళ్ల దహనానికి సంబంధించిన సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న గౌతమ్తేజను విచారించారు. ఘటన సమయంలో బీరువాలో ఆయిల్క్యాన్లపై వివరాలు సేకరించినట్టు సమాచారం. అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలోని బృందం ఈ విచారణ చేపట్టింది. ఈ బృందంలో ఎస్పీ విద్యాసాగర్నాయుడు, అడిషనల్ ఎస్పీ రాజ్కుమార్, సీఐడీ ఎస్పీ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.