లక్ష రూపాయలు, ఐదు తులాల బంగారం చోరీ

Update: 2024-08-28 16:31 GMT

దిశ, ఊట్కూర్ : వ్యవసాయ పనులకు వెళ్లిన రైతు ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఊట్కూర్ మండల కేంద్రంలోని ఓ రైతు పని నిమిత్తం వ్యవసాయ పనులకు వెళ్లారు. భార్య బంధువుల ఫంక్షన్ కు వెళ్ళింది. వ్యవసాయం క్షేత్రం నుంచి రైతు ఇంటికి వచ్చి చూడగా ప్రధాన ద్వారనికి వేసిన తాళం ధ్వంసం చేసి ఉండటంతో అనుమానం వచ్చి ఇంట్లో పెట్టిన లక్ష రూపాయలు ఐదు తులాల బంగారం ఉన్న ప్లేస్ ను చూడటంతో అక్కడ డబ్బులు బంగారం కనిపించకపోవడంతో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి చోరీ చేసినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఎస్సై కృష్ణంరాజు పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు..


Similar News