Breaking: ఏలూరు జిల్లాలో ఘోరం.. ముగ్గురు దుర్మరణం

ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....

Update: 2024-07-08 02:41 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్‌లో కంటైనర్ లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కారు, లారీని రోడ్డు నుంచి పక్కకు తీశారు. ఈ ఘటనతో నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. స్థానికుల నుంచి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా రోడ్డు ప్రమాదాలపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా ఇంకా ఘటనలు చోటు చేసుకోవడంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. అతివేగం ప్రమాదకరమని, వాహనదారులు రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. డ్రైవర్లు డ్రైవింగ్ చేసేటప్పుడు కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. వాహనదారులు మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దని సూచించారు. రోడ్డు రూల్స్ కచ్చితంగా పాటించాలని చెప్పారు. కారు నడిపే డ్రైవర్లు కచ్చితంగా సీటు బెల్టు ధరించాలని పోలీసులు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 


Similar News