ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ఇద్దరు మృతి, 16 మందికి గాయలు

ఏపీలోని అనకాపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది.

Update: 2024-08-21 10:53 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని అనకాపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. అచ్యుతాపురం సెజ్ లోని ఓ కంపెనీలో రియాక్టర్ పేలిపోయింది. సెజ్ లోని ఎసెన్సియా ఫార్మా కంపెనీలోని ఓ రియాక్టర్ లో ఒత్తిడి పెరిగి పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందగా, 16 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో మరి కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాద ధాటికి కంపెనీ నుండి భారీ ఎత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. ఆ గ్రామంలో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. అనకాపల్లి కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిచాలని ఆదేశించారు.    


Similar News