Prakasam Barrage: కొనసాగుతోన్న బోట్ల తొలగింపు ప్రక్రియ.. రంగంలోకి స్కూబా డైవర్స్
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ మూడో రోజు కూడా కొనసాగుతోంది.
దిశ, వెబ్డెస్క్: ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ మూడో రోజు కూడా కొనసాగుతోంది. బ్యారేజీలోకి వరద నీటి ఉధృతి ఎక్కువ ఉండటంతో బోట్ల తొలగింపు ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. దీంతో అధికారులు స్కూబా డైవర్స్ను రంగంలోకి దింపారు. నీటి అడుగుకు వెళ్లి పడవలను ముక్కలు చేసి తొలగించేందుకు గాను అండర్ వాటర్ ఆపరేషన్ను బుధవారం ప్రారంభించారు. ఈ క్రమంలో నది లోపలికి వెళ్లి పడవలను కట్టర్లతో స్కూబా టీమ్ ముక్కలు చేస్తున్నారు. అయితే ఈ ఆపరేషన్ పూర్తి అయ్యేందుకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.