Varla Ramaiah: వైఎస్ షర్మిల ప్రాణాలకు ముప్పు ఉంది.. టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు

మాజీ సీఎం జగన్ (Former CM Jagan) నుంచి వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రాణాలకు ముప్పు ఉందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-25 15:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం జగన్ (Former CM Jagan) నుంచి వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రాణాలకు ముప్పు ఉందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి రూ.కోట్లు దోచుకున్నా.. జగన్‌ (Jagan)కు ఇంకా ధనదాహం చల్లరలేదని ఫైర్ అయ్యారు. ఆస్తుల కోసం సొంత చెల్లి షర్మిల (Sharmila), జన్మనిచ్చిన తల్లి విజయమ్మ (Vijayamma)పై కోర్టుకెక్కిన మాజీ సీఎంను ఎక్కడైనా చూశామా అని ప్రశ్నించారు.

జగన్‌ (Jagan)కు కుటుంబ బాంధవ్యాలు అక్కర్లేదని.. కేవలం డబ్బు కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టే వ్యక్తి అని ధ్వజమెత్తారు. మొత్తం కుటుంబ వ్యవస్థనే ఆయన అగౌరవపరుస్తున్నాడని విమర్శించారు. రాజకీయాల కోసం, ఆస్తుల కోసం తోడబుట్టిన చెల్లిని వీధిన పడేసిన నీచమైన వ్యక్తిత్వం జగన్‌దేనని అన్నారు. నాడు రాజకీయాలు, పదవుల కోసం సొంత బాబాయ్‌ వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy)ని భూమి మీద లేకుండా చేశారని.. నేడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలైన వైఎస్ షర్మిల (YS Sharmila)కు అదే వ్యక్తితో ప్రాణలకు ముప్పు ఉందని వర్ల రామయ్య (Varla Ramaiah) ఆరోపించారు.  


Similar News