AP News:‘రాజకీయాల్లో పవర్ అనేది పవరే’..మాజీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

సీఎం చంద్రబాబు పై వైసీపీ చేస్తున్న ఆరోపణలు దారుణమని టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు.

Update: 2024-09-07 07:49 GMT

దిశ,వెబ్‌డెస్క్:సీఎం చంద్రబాబు పై వైసీపీ చేస్తున్న ఆరోపణలు దారుణమని టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఈ క్రమంలో ఆయన నేడు(శనివారం) మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. వైసీపీకి ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదని వారిపై వైఎస్ జగన్ కక్ష కట్టారన్నారని ఆరోపించారు. సింగ్ నగర్ ప్రాంతం వైసీపీకి అనుకూలంగా ఉన్న ప్రాంతమన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 మంది పోటీ చేస్తే వారంతా కనపడడం లేదన్నారు. జలాశయాల విషయంలో వైఎస్‌ఆర్ ఆశయాన్ని జగన్ ముందుకు తీసుకు వెళ్లలేదని విమర్శించారు.

వైఎస్ జగన్ బుడమేరు పనులు పూర్తి చేసి ఉంటే విజయవాడకు నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. గత ప్రభుత్వం వల్లే విజయవాడకు ఈ దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 మంది వైసీపీ వారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో వరద వస్తే ఎవ్వరూ రాలేదని..అలాంటి వారు చంద్రబాబు ఇక్కడే ఉండి సహయక చర్యలు చేస్తుంటే ఆయనను విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. విదేశాలకు వెళదామనుకున్న జగన్ ఇక్కడ ఉండి ప్రజలకు సేవ చేయాలని అలా కాకుండా ఆయన రాజకీయ విమర్శలు చేస్తున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని విమర్శించారు. రాజకీయాల్లో పవర్ అనేది పవరే అని..పవర్‌లో ఉన్న వారు పిచ్చి వాగుడు వాగడం సరికాదని..కావాలంటే ఇప్పుడు వచ్చి మాట్లాడమనండి అంటూ ఎమ్మెల్యే యార్లగడ్డ సవాల్ విసిరారు.


Similar News