మా వాళ్లు తిరగబడితే మీరు కొట్టుకుపోతారు.. కూటమి నేతలకు పేర్ని నాని వార్నింగ్

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు....

Update: 2024-10-04 11:43 GMT

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy)పై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(CM Chandrababu, Deputy CM Pawan Kalyan) చేసిన  వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా వైసీపీ కార్యకర్తలతో భేటీ అయిన ఆయన జగన్‌కు అధికారం లేకపోవచ్చని, కానీ మోసపూరిత హామీలు మాత్రం ఇవ్వరని కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శలు చేశారు. జనాన్ని మోసం చేసేందుకు జగన్ గోధుమ రంగు పంచ, ఎర్ర లుంగీ కట్టలేదని ఎద్దేవా చేశారు. కులమతాలపై మొన్నొకలా.. నేడు మరోలా పవన్ మాదిరి జగన్ మాట్లాడరని చెప్పారు. చంద్రబాబులా ఎవరి సాయంతోనూ జగన్ అధికారంలోకి రాలేదని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా సింగిల్‌గా వస్తారని తెలిపారు. కాకపోతే తన హయాంలో వైసీపీ కార్యకర్తలను పట్టించుకోలేదని జగన్ బాధపడుతున్నారని చెప్పారు. కార్యకర్తల కృషి వల్లే 2019లో 151 సీట్లు సాధించామని, 2029లో 175 స్థానాల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని పేర్నినాని ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలంతా కలిసికట్టుగా ఉండాలని సూచించారు. వైసీపీ కార్యకర్తలు తిరగబడితే కూటమినేతలు కొట్టుకుపోతారని పేర్ని నాని  స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 


Similar News