ఏపీ ప్రజలు ఎంతో చైతన్యవంతులు : ప్రధాని నరేంద్రమోడీ ట్వీట్

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రఅవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Update: 2023-11-01 06:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రఅవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశారు. ఏపీ ప్రజలు ఎంతో చైతన్యవంతులంటూ ప్రధాని నరేంద్రమోడీ ట్వీట్ చేశారు. అంతేకాదు అసాధారణమైన ప్రతిభ, అచంచలమైన సంకల్పం, దృఢమైన పట్టుదల ఇక్కడి ప్రజల సొంతమంటూ ప్రధాని కొనియాడారు. ఏపీ ప్రజల శ్రేయస్సు కోసం, విజయం కోసం నిరంతరం తాను ప్రార్థిస్తానంటూ ప్రధాని మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు.‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభసందర్భంగా, ఈ చైతన్యవంతమైన రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి అసాధారణమైన ప్రతిభ, అచంచలమైన సంకల్పం మరియు దృఢమైన పట్టుదలతో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభిన్న రంగాలలో తమదైన ముద్ర వేశారు. వారి నిరంతర శ్రేయస్సు మరియు విజయం కోసం నేను ప్రార్థిస్తున్నాను’ అని నరేంద్రమోడీ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News