AP News:జాతరను తలపించేలా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ..టీడీపీ ఇంచార్జ్ కీలక వ్యాఖ్యలు

ఆదివారం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇంచార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు.

Update: 2024-06-30 11:38 GMT

దిశ,ఎర్రగొండపాలెం:ఆదివారం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇంచార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో 36,581 మంది వృద్ధులకు, వికలాంగులకు వితంతువులకు ₹7,000 చొప్పున పెన్షన్ పంపిణీ చేయనున్నారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకాల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం భారీ ఎత్తున చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

మండల నాయకులు గ్రామ నాయకులు సచివాలయ సిబ్బందితో పాటుగా కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల వద్దకే వెళ్లి నేరుగా పెన్షన్ పంపిణీ చేస్తారని అన్నారు. గతంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్‌ని చంద్రబాబు నాయుడు 2000 చేశారు. జగన్ వంతులవారీగా ఐదు సంవత్సరాల్లో పెంచుకుంటూ 3000 చేశారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం 4000 చేసింది. మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం. ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం అన్నారు. ఈ కార్యక్రమంలో కంచర్ల సత్యనారాయణ గౌడ్, తోట మహేష్ నాయుడు, చేకూరి సుబ్బారావు, మెడబలిమి అజితారావు, ఎనుముల నాగేశ్వరరావు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News