Big Breaking: ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన జనసేనాని..

సంక్రాంతి బరిలో కయ్యానికి కాలుదువ్వే కోడిపుంజుల్లా ఎన్నికల బరిలో నాయకులు మాటల యుద్దానికి సై అంటే సై అంటున్నారు.

Update: 2024-02-05 10:17 GMT

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నకల్లో విజయ పతాకాన్ని ఎగరవేసి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఇటు విపక్షాలు, ప్రస్తుతం ఉన్న అధికారాన్ని రానున్న ఎన్నికల్లో చేజారకుండా చూసుకునేందుకు అధికార పార్టీ తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నాయి. సంక్రాంతి బరిలో కయ్యానికి కాలుదువ్వే కోడిపుంజుల్లా ఎన్నికల బరిలో నాయకులు మాటల యుద్దానికి సై అంటే సై అంటున్నారు.

అటు అధికార పార్టీ నేతలు, అధినేత విపక్షాలపై విమర్శలు చేస్తూనే, ఇటు పార్టీని వీడిన వైసీపీ ఎమ్మెల్యేలను కూడా దుయ్యబడుతున్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే అధికార పార్టీ వ్యాఖ్యలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీటుగా ఘాటైన కౌంటర్ ఇస్తున్న విషయం అందరికి తెలిసిందే. కాగా తాజాగా ఓ భహిరంగ సభలో మాట్లాడిన జనసేనాని జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ మాట మాటకి సిద్ధం సిద్ధం అంటున్నారని.. రాష్ట్రం మొత్తం సిద్ధం పోస్టర్లతో, ఫ్లెక్సీలతో, హోర్డింగ్లతో నిండిపోయిందని.. అసలు జగన్ దేనికి సిద్ధం అని ప్రశించారు..? అలానే ఆయన అసలు అబద్దాలే చెప్పను అంటరాని.. కానీ ఆయన చెప్పేవే అబద్దాలని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి అధికారం లోకి రాగానే సిపిఎస్ రద్దు చేస్తానని, అలాగే టీచర్ పోస్ట్ లకు సంబంధించి DSC నోటికేషన్ ఇస్తానని, మద్యపానాన్ని నిషేధిస్తామని హామీలు ఇచ్చారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే వాటిలో ఏ ఒక్కటి కూడా చెయ్యలేదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.  

Read More..

Open Letter: పవన్‌కు మళ్లీ అదే సలహా..!

Tags:    

Similar News