చేరికలపై కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్

జనసేన పార్టీలో చేరికలు తమకు మరింత విశ్వాసాన్ని ఇచ్చాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Update: 2024-10-19 14:02 GMT

దిశ, వెబ్ డెస్క్ : జనసేన పార్టీలో చేరికలు తమకు మరింత విశ్వాసాన్ని ఇచ్చాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ముద్రగడ క్రాంతి, జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిలర్లు నలుగురు, గుంటూరుకు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరారు. సామినేని ఉదయభానుకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా బాధ్యతలు అప్పగించినట్టు ఈ సందర్భంగా పవన్ ప్రకటించారు. తమపై నమ్మకంతో మా పార్టీలో చేరుతున్న వారికి కృతజ్ఞతలు అని తెలియజేశారు. ఇపుడు తమ బాధ్యత మరింత పెరిగిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అవినీతికి ఆస్కారం లేకుండా అభివృద్ది పనులు జరుగుతున్నాయని అన్నారు. గుడివాడలో తాగునీటి సమస్య తమ దృష్టికి రాగానే వెంటనే చర్యలు చేపట్టామని, అవసరమైన నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు తీర్చడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని పవన్ పేర్కొన్నారు.    


Similar News