Pawan Kalyan: పవన్ ఆదేశాలతో సరస్వతి భూముల్లో సర్వే

పల్నాడు జిల్లాలోని సరస్వతి భూముల్లో అధికారుల సర్వే చేపట్టారు..

Update: 2024-10-26 10:33 GMT

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా(Palnadu District)లోని సరస్వతి భూముల్లో అధికారుల సర్వే చేపట్టారు. దాచేపల్లి, మాచవరం(Dhagepalli, Machavaram) మండలాల్లో సరస్వతి పవర్ సంస్థ(Saraswati Power Company)కు చెందిన భూములున్నాయి. అయితే ఆ భూముల్లో అటవీ భూములు(Forest lands)న్నాయనే ప్రశ్నలు తలెత్తాయి. దీంతో సర్వే చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. అనంతరం సమగ్ర నివేదిక తనకు ఇవ్వాలని సూచించారు. దీంతో సరస్వతి భూముల్లో అధికారులు శనివారం సర్వే ప్రక్రియ ప్రారంభించారు. దాచేపల్లి DRO ఆధ్వర్యంలో ఫారెస్ట్ సిబ్బంది సర్వే చేస్తున్నారు.

Read More : సార్.. మా గోడు ఆలకిచండి..’ పవన్‌ కల్యాణ్‌కు 4 గ్రామాల ప్రజల లేఖలు


Similar News