Viral News: వైరల్ గా మారిన నాగబాబు ట్వీట్.. మండిపడుతున్న నెటిజన్స్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార పార్టీకి విపక్షాలకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది.

Update: 2024-04-10 05:18 GMT

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార పార్టీకి విపక్షాలకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. అధికార పార్టీ నేతలు ప్రతి పక్ష నేతలు అటు బహిరంగ సభల్లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్న కొణిదెల నాగబాబు సైతం అధికార పార్టీ అధినేతపై ట్విట్టర్ వేదికగా సెటైర్ల వర్షం కురిపించారు.

ఆనాటి పరీక్ష పేపర్ల దొంగే నేటి భూ కబ్జా ముఠా నాయకుడు అలియాస్ పులివెందుల పులకేశి వైఎస్ జగన్ అని ట్యాగ్ చేస్తూ ఓ వీడియోని ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కాగా నాగబాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. కాగా ఈ ట్వీట్ చూసిన నెటిజన్స్ నాగబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ పరీక్ష పేపర్లు దొంగిలించారు అనడానికి ఆధారాలు ఉంటె చూపెట్టమని డిమాండ్ చేస్తున్నారు. ఆ వీడియో మీరు ఒకసారి చూసేయండి.  

Tags:    

Similar News