MLA Shankar: ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను అనుమతించండి.. సీఎం చంద్రబాబును కోరిన ఎమ్మెల్యే శంకర్

తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలపై శ్రీవారి భక్తులను దర్శనానికి అనుమతించాలని ఏపీ సీఎం చంద్రబాబును బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు.

Update: 2024-09-13 08:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలపై శ్రీవారి భక్తులను దర్శనానికి అనుమతించాలని ఏపీ సీఎం చంద్రబాబును బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ సిఫారసు లేఖలను అనుతించలేదని అన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో తమ విజ్ఞప్తిని పరిశీలించాలని అన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని టీటీడీ కల్యాణ మండపాలను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేయాలన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు కూడా చొరవ తీసుకోవాలని కోరారు. శుక్రవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో పాటు ఎంపీ డీకే అరుణ, మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం స్వామి వారిని దర్శించుకున్నారు.    


Similar News