Tirumala: శ్రీవారి లడ్డూపై మంత్రి సంధ్యారాణి కీలక వ్యాఖ్యలు

తిరుమల లడ్డూపై మంత్రి సంధ్యారాణి కీలక వ్యాఖ్యలు చేశారు...

Update: 2024-10-07 06:23 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ(Tirumala Laddu)పై మంత్రి సంధ్యారాణి(Minister Sandhyarani) కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో లడ్డూల్లో అపవిత్రం జరిగిందా లేదా అనేది భక్తులే చెబుతారని, కోర్టులు అవసరం ఆమె చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఐదేళ్లకు ముందు ఏ ప్రభుత్వంలోనూ లడ్డూలో కల్తీ జరగలేదన్నారు. లడ్డూను చూస్తే వెంకటేశ్వరస్వామిని(Venkateswara Swamy)ని చూసినంత ఆనందం కలుగుతుందన్నారు. అలాంటి లడ్డూ తయారీలో పూర్తి బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. గడిచిన ఐదేళ్లతో పోలిస్తే ఇప్పుడు లడ్డూ నాణ్యత బాగుందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. 


Similar News