Nara Lokesh:నేడు కోర్టుకు హాజరుకానున్న మంత్రి నారా లోకేష్.. కారణం ఇదే!

ఏపీలో ఓ ప్రముఖ దినపత్రికపై వేసిన పరువు నష్టం దావా కేసులో ఐటీ, విద్యాశాఖ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ నేడు (శుక్రవారం) విశాఖపట్నంలో కోర్టుకు హాజరు కానున్నారు.

Update: 2024-10-18 05:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఓ ప్రముఖ దినపత్రికపై వేసిన పరువు నష్టం దావా కేసులో ఐటీ, విద్యాశాఖ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ నేడు (శుక్రవారం) విశాఖపట్నంలో కోర్టుకు హాజరు కానున్నారు. ఇప్పటికే విశాఖ నగరానికి చేరుకున్న ఆయన పార్టీ కార్యాలయంలో బస చేశారు. ‘చిన‌బాబు చిరుతిండి.. 25 ల‌క్షలండి’ పేరుతో ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన క‌థ‌నంపై లోకేష్ న్యాయ‌ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ప‌రువున‌ష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో ఈ కేసు విచారణ జ‌ర‌గ‌నుంది. ‘చినబాబు చిరుతిండి.. రూ. 25 లక్షలండి’ అనే టైటిల్‌తో 2019లో ఓ ప‌త్రిక‌లో స్టోరీ ప్రచురితమైంది. దీనిని అవాస్తవాల‌తో ఉద్దేశ‌పూర్వకంగా త‌న‌ను డ్యామేజ్ చేయాల‌ని ఈ స్టోరీ వేశార‌ని నారా లోకేష్ అప్పట్లో పేర్కొన్న విషయం తెలిసిందే.


Similar News