AP News:‘ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి’.. మంత్రి లోకేష్ కీలక సూచన
గుంటూరు జిల్లా ఉండవల్లి లోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాల పై చర్చించారు.
దిశ,రాయచోటి: గుంటూరు జిల్లా ఉండవల్లి లోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాల పై చర్చించారు. ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంట్ పరిధిలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పథకాల అమలు తీరు, భవిష్యత్తులో చేపట్టవలసిన కార్యక్రమాల పై మంత్రి నారా లోకేష్ చమర్తితో చర్చించి వారికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా చమర్తి జగన్ మోహన్ రాజు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం ప్రతి నిత్యం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లే బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్త తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాల అమలు ప్రతి ఒక్కరు దగ్గరుండి విజయవంతం చేయాలని, రాజంపేట పార్లమెంట్ పరిధిలోని టీడీపీ నాయకులను కార్యకర్తలను ఎప్పటికప్పుడు చైతన్యపరిచి వారికి అండగా నిలవాలని ముఖ్యంగా పార్టీ అధినేత ఆశయాలను పార్టీ యొక్క సిద్ధాంతాలను తూచ తప్పకుండా అమలు చేయాలని యువనేత నారా లోకేష్ సూచించినట్లు ఆయన తెలియజేశారు.