ఏపీలో వరద బాధితులకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ భారీగా ఆర్థిక సాయం

భారీ వర్షాల కారణంగా ఏపీలో సంభవించిన వరదల కారణంగా చాలా మంది ప్రజలు రోడ్డున పడ్డారు.

Update: 2024-09-09 17:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాల కారణంగా ఏపీలో సంభవించిన వరదల కారణంగా చాలా మంది ప్రజలు రోడ్డున పడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, వివిధ సంస్థలు ఏసీ సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా.. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఇంజనీరింగ్ సంస్థ గా పేరుగాంచిన మేఘా కంపెనీ.. భారీగా ఆర్థిక సహాయం ప్రకటించింది. ఇందులో భాగంగా.. రూ.5 కోట్ల చెక్ ను మేఘా MD కృష్ణారెడ్డి, డైరెక్టర్ సుబ్బయ్య ముఖ్యమంత్రికి అందజేశారు. కాగా ఐదు కోట్ల విరాళం అందించిన వారికి సీఎం చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹5 కోట్ల విరాళం అందించినందుకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ MD కృష్ణారెడ్డి, డైరెక్టర్ సుబ్బయ్యకు ధన్యవాదాలు. వినాశకరమైన వరదల వల్ల దెబ్బతిన్న జీవితాలను పునర్నిర్మించడంలో వారి సహకారం కీలక పాత్ర పోషిస్తుందని సీఎం తన ట్వీట్ లో రాసుకొచ్చారు.


Similar News