మావోయిస్టుల ఘాతుకం.. ఏపీకి చెందిన జవాన్ మృతి

మావోయిస్టుల ఘాతుకం వల్ల ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జవాన్ రాజేష్ మృతి చెందారు.

Update: 2024-10-20 04:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టుల ఘాతుకం వల్ల ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జవాన్ రాజేష్ మృతి చెందారు. మావోయిస్టులు అమర్చిన మైనింగ్‌ బాంబు పేలి శనివారం సాయంత్రం ఇద్దరు జవాన్లు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఈ ఘటనలో ఏపీలోరి బ్రహ్మంగారిమఠం మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన జవాన్‌ రాజేష్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఆయన మరణంతో పాపిరెడ్డి పల్లె లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా నేడు స్వగ్రామానికి జవాన్ మృతదేహం చేరుకోనుండటంతో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడకు చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే మావోయిస్టుల బాంబుకు బలైన జవాన్‌ రాజేష్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు గ్రామ ప్రజలు తెలుపుతున్నారు.


Similar News