‘ఆ దృశ్యాలు నన్ను తీవ్రంగా కలచివేశాయి’.. హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు

ప్రేమోన్మాది దాడిలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించగా ఆమె చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయింది.

Update: 2024-10-20 08:23 GMT

దిశ, వెబ్‌డెస్క్:ప్రేమోన్మాది దాడిలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించగా ఆమె చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం ఈ ఘటన కడప జిల్లాలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా బద్వేలులో ప్రేమోన్మాది పెట్రోల్ దాడి ఘటనలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన పై ఏపీ హోం మంత్రి అనిత స్పందించారు. ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ.. ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన విషాదకరమని హోం మంత్రి అనిత తెలిపారు. తీవ్రంగా గాయపడి కోలుకోలేక ఆస్పత్రిలో మృతి చెందడం చాలా దిగ్భ్రాంతికరమని అన్నారు. బాలికపై దాడి అనంతర దృశ్యాలు తీవ్రంగా కలచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడు విఘ్నేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు చెప్పారు. జిల్లా ఎస్పీ హర్సవర్ధన్ రాజు నేత‌ృత్వంలో 4 బృందాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిందితుడు, అతనికి సహకరించిన వారికి కఠిన శిక్ష పడేలా చేస్తామని హోం మంత్రి అనిత తెలిపారు. బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News