చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడమే జగన్ పని: అచ్చెన్నాయుడు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టడమే వైఎస్ జగన్ పని అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Update: 2023-11-06 12:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టడమే వైఎస్ జగన్ పని అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలవ్వడాన్ని రాష్ట్ర ప్రజలు ఎంతో స్వాగతించారని అని చెప్పుకొచ్చారు. అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారని చెప్పుకొచ్చారు. అన్ని వర్గాల అభ్యున్నతికి చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశారని దాని ఫలితమే ఆయన కోసం రాత్రంతా రోడ్లపై వేచి చూసి మరీ స్వాగతం పలికారని అన్నారు. అలాంటి చంద్రబాబు నాయుడుపై టీడీపీ హయాంలో ఉచితంగా ఇచ్చిన ఇసుకలో కూడా అవినీతి జరిగిందని సీఐడీ కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు. ఈ రాష్ట్రానికి జగన్‌ తీరని నష్టం చేశారని చెప్పుకొచ్చారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లారని మండిపడ్డారు. ఇకపోతే వచ్చే ఎన్నికల్లో పులివెందుల సహా అన్ని స్థానాల్లో టీడీపీ గెలుపొందడం ఖాయమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ప్రతీ సభలో సీఎం వైఎస్ జగన్ నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ వారిపైనే తిరిగి సీఎం వైఎస్ జగన్ దాడి చేస్తున్నారని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దళిత సమ్మేళన సభలో అచ్చెన్నాయుడు మాట్లాడారు. నా ఎస్సీ, ఎస్టీలు అంటూనే వారికి చెందిన పథకాలన్నీ జగన్‌ రద్దు చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మండిపడ్డారు. 

Tags:    

Similar News