Janasena:జనసేన ఎమ్మెల్సీగా హైపర్ ఆది..క్లారిటీ ఇదే!

ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జనసేన తరఫున సినీ నటులు పాల్గొన్నారనే సంగతి తెలిసిందే.

Update: 2024-07-23 15:25 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జనసేన తరఫున సినీ నటులు పాల్గొన్నారనే సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో సినీ నటులు హోరెత్తించారు. కానీ వీరిలో హైపర్ ఆది మాత్రం పిఠాపురంలోనే కాకుండా పలు చోట్ల పర్యటించి కూటమి అభ్యర్థుల తరఫున కూడా ప్రచారం నిర్వహించారు. అయితే ఈ క్రమంలో తనకు జనసేన నుంచి ఎమ్మెల్సీ పదవి ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారం పై తాజాగా జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది స్పందించారు. ‘శివం భజే’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో హైపర్ ఆది కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే వార్తలో వాస్తవం లేదని కమెడియన్ హైపర్ ఆది స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ సంతోషంగా ఉంటే దూరంగా ఉండి చూస్తానని, బాధలో ఉంటే దగ్గరకెళ్లి చూసుకుంటానని ఆది వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ పై జరుగుతున్న ట్రోలింగ్ ఆపాలని హైపర్ ఆది కోరారు.

Tags:    

Similar News