అదృష్టంగా భావిస్తున్నాను.. పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్

తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) దసరా(Dussehra) పండుగ శుభాకాంక్షలు చెప్పారు.

Update: 2024-10-11 14:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) దసరా(Dussehra) పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. ‘‘దేవీ నవరాత్రులకు ముగింపుగా ప్రవేశిస్తున్న విజయదశమి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు. భారత దేశం నలుదిక్కులా భక్తులు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఇది. అత్యంత పవిత్రమైనది. ఆధ్యాత్మిక వేడుక. ఊరు వాడంతా అమ్మవారి సంబరాలతో భక్తిభావం ఉట్టిపడుతుంది.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోని తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గమ్మ ఆలయం కిక్కిరిసిన భక్తులతో అలరారుతోంది. ఈ నవరాత్రులలో దుర్గమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ విజయదశమి ప్రజలందరికీ విజయాలు చేకూర్చాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా విరాజిల్లాలని శక్తి స్వరూపిణిని ప్రార్థిస్తున్నాను’’ అని పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.



Similar News