సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ,...

Update: 2024-08-07 07:20 GMT

దిశ, వెబ్ డెస్క్: సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సచివాలయం మొదటి బ్లాక్‌లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరుగుతోంది. డిప్యూటీ సీఎం సహా మంత్రులు, ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ర్యాటిఫికేషన్‌తోపాటు వాలంటీర్ల కొనసాగింపు, భూ అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులపై చర్చిస్తున్నారు. వీటితో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, సహకార సంఘాల్లో నిబంధనలపై సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధనపైనా చర్చిస్తున్నారు. రామాయపట్నం పోర్టుతో పాటు ఎయిర్ పోర్టుల అభివృద్ధిపైనా చర్చిస్తున్నట్లు సమాచారం. అన్న క్యాంటీన్లు సహా పలు సంక్షేమపథకాల అమలుతో పాటు 217 జీవో రద్దు, నూతన మద్యం పాలసీ, వైసీపీ చేపట్టిన భూముల రీసర్వే, ప్రభుత్వం రంగ సంస్థలు, ఆయా శాఖల్లో జరిగిన అక్రమాలపై విచారణ వంటి అంశాలపైనా మంత్రులతో చంద్రబాబు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కూటమి నేతలు అంటున్నారు. 

Tags:    

Similar News