పిఠాపురం ఎంబీబీఎస్ విద్యార్థినికి పవన్ ఆర్థిక సాయం

పిఠాపురం ఎంబీబీఎస్ విద్యార్థినికి పవన్ ఆర్థిక సాయం చేశారు..

Update: 2024-09-24 02:36 GMT

దిశ, ఏపీ బ్యూరో: పిఠాపురం నియోజకవర్గం నవఖండ్రవాడ గ్రామానికి చెందిన రైతు చక్రవర్తుల శ్రీనివాస్ కుమార్తె సత్య జగదీశ్వరి అనే విద్యార్థిని నీట్ ద్వారా ఎం.బి.బి.ఎస్. సీట్ పొందారు. కాలేజీలో చేరేందుకు ఆర్థిక సమస్యలు ఉన్న విషయం ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. తక్షణం స్పందించి రూ.4 లక్షలు ఆర్థిక సహాయం చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్యార్థిని సత్య జగదీశ్వరి, ఆమె తండ్రి చక్రవర్తుల శ్రీనివాస్‌కి చెక్కును అందచేశారు. చదువులో రాణించాలని ఆశీర్వదించారు. పవన్ చేసిన సహాయం మరువలేనిదని విద్యార్థిని, ఆమె తండ్రి కృతజ్ఞతలు తెలిపారు.

 


Similar News