విదేశాలకు భారీగా రేషన్.. మంత్రి నాదెండ్ల టార్చిలైట్ వెలుగుల్లో కనిపించిన స్కాం

మంత్రి నాదెండ్ల మనోహర్ నల్లజర్లలో నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యం లభ్యమయ్యాయి.

Update: 2024-10-09 15:59 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల రాత్రివేళ చేపట్టిన తనిఖీల్లో భారీగా రేషన్ బియ్యం స్కాం వెలుగుచూసింది. ఉమ్మడి గుంటూరు జిల్లా నల్లజర్లలో ఉన్న శ్రీ వెంకట సత్య రైస్ మిల్లులో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మూసి ఉన్న గోడౌన్ ను తెరిపించి చూడగా.. అక్కడ భారీగా రేషన్ బియ్యాన్ని నిల్వచేసినట్లు కనిపించింది. టార్చిలైట్ వేసి పరిశీలించగా.. అక్కడున్న బియ్యం సంచులపై విదేశీ కంపెనీల పేర్లు ఉన్నట్లు గుర్తించారు. అక్రమంగా విదేశాలకు తరలించేందుకు రేషన్ బియ్యాన్ని అక్కడ నిల్వ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై రైస్ మిల్లు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని అధికారులు విచారణ చేస్తున్నారు. అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News