టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో కీలక పరిణామం

2021లో మంగళగిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం పై వైసీపీ శ్రేణులు దాడి చేశారు

Update: 2024-10-13 07:15 GMT

దిశ, వెబ్ డెస్క్: 2021లో మంగళగిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం పై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. కేసుకు సంబంధించిన విచారణ నేటికి సాగుతూనే ఉంది. అయితే ఈ కేసు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 3 సంవత్సరాలుగా విచారణ కొనసాగుతున్న ఈ కేసు మంగళగిరి పోలీస్ స్టేషన్ పరిధి నుంచి.. సీఐడీకీ బదలాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ఈ దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ జైలులో ఉన్నారు. కాగా ఇదే కేసులో సజ్జల, దేవినేని అవినాష్‌, లేళ్ల అప్పిరెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. దీంతో కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకొని సీఐడీకి బదలాయించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


Similar News