Floods:విజయవాడలో వరదలు..మాజీ సీఎం జగన్ పై రోజా ఇంట్రెస్టింగ్ ట్వీట్!

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు అల్లకల్లోలం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి.

Update: 2024-09-06 09:34 GMT

దిశ,వెబ్‌డెస్క్:రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు అల్లకల్లోలం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇక విజయవాడ జిల్లాను వరద నీరు ముంచెత్తింది. ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో వరద బాధితులకు అండగా పలువురు విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మాజీ మంత్రి రోజా..వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ హయాంలో చేపట్టిన సంస్కరణలే ఈ రోజు(శుక్రవారం) విజయవాడ ప్రజలను వరద కష్టాల నుంచి గట్టెక్కిస్తున్నాయని మాజీ మంత్రి రోజా చెప్పారు. జగనన్న తీసుకొచ్చిన రేషన్ వాహనాలు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, జగనన్న హయాంలో కొన్న 108, 104 వాహనాలు, క్లీన్ ఆంధ్రా వాహనాలు, వైఎస్‌ఆర్ హెల్త్ సెంటర్లు ఈ రోజు వరద కష్టాల నుంచి విజయవాడ ప్రజలను గట్టెక్కిస్తున్నాయి అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.


Similar News