ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై దువ్వాడ..దివ్వెల ఫైర్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీలు తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.

Update: 2024-10-11 09:27 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీలు తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఓ టీవీ చానల్ డిబెట్ లో మాట్లాడిన సందర్భంగా జనసేన పార్టీ వారు మా బంధంపై అభ్యంతరకర కామెంట్లు పెడుతు తిడుతున్నారని, మరి పవన్ కల్యాణ్ తన మూడో భార్య అన్నా లెజినోవాను పెళ్ళికి ముందే తల్లిని చేయడం కరెక్టేనా అంటూ ప్రశ్నించారు. పవన్ వ్యవహారం వారి వ్యక్తిగతమైనప్పుడు మా వ్యవహారం కూడా వ్యక్తిగతమన్న సంగతి జనసేన వారు గుర్తించాలన్నారు. తమపై జనసేన కార్యకర్తలు చేస్తున్న విమర్శలు, బెదిరింపులపై ఇప్పటికే తాను పోలీస్ ఫిర్యాదు చేశానని దువ్వాడా చెప్పగా, పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తలను మోసం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయకుండా కూటమిలో కలిపేశాడని విమర్శించారు.

అంతకు ముందు మరో చానల్ మాట్లాడిన సందర్భంలోనూ మూడు పెళ్ళిళ్లు చేసుకున్న పవన్ కు డిప్యూటీ సీఎం పదవిలో ఉండే అర్హత లేదంటూ దువ్వాడ, దివ్వెల వివాస్పద కామెంట్ చేశారు. అసలు రాజకీయాలకు, వ్యక్తిగత జీవితాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. పవన్ చేస్తే ఒప్పు మేం చేస్తే తప్పా అని ప్రశ్నించారు. పవన్, నేను చొక్కాలు విప్పుకున్నామని మాపై రాళ్లు వేస్తున్నారని, మమ్మల్ని అనేముందు ప్రతి వారు వారి చరిత్రలు చూసుకుంటే మంచిదని దువ్వాడ హితవు పలికారు. మరోవైపు ముగ్గురిని పెళ్లి చేసుకొని డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలన్న మాధురి వ్యాఖ్యలపై పవర్ స్టార్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వ్యక్తిగత విషయాలను రాజకీయాలకు ఆపాదించవద్దని హితవు పలికారు. మీ వివాదాన్ని పరిష్కరించుకోకుండా పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఎందుకు తీసుకువచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో ఆమెపై పరువు నష్టం దావా వేయాలని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే తిరుమలలో రీల్స్, వీడియోలు చేసిన నేపథ్యంలో దివ్వెల మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 


Similar News