దువ్వాడకు నేనే ఆస్తులు ఇచ్చా.. వాణి తండ్రి రాఘవరావు సంచలన వ్యాఖ్యలు

వ్వాడ శ్రీనివాస్‌కు తానే ఆస్తులు ఇచ్చానని వాణి తండ్రి సంపతి రాఘవరావు తెలిపారు...

Update: 2024-08-11 13:14 GMT

దిశ, వెబ్ డెస్క్: దువ్వాడ శ్రీనివాస్‌కు తానే ఆస్తులు ఇచ్చానని వాణి తండ్రి సంపతి రాఘవరావు తెలిపారు. దువ్వాడ శ్రీనివాస్, భార్య వాణి వివాదంపై ఆయన స్పందించారు. దువ్వాడ శ్రీనుకు చాలాసార్లు సర్ది చెప్పే ప్రయత్నం చేశామని, కానీ వినడంలేదన్నారు. శ్రీను, వాణి కలిసి ఉండాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. శ్రీనుతో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నానని, కానీ దొరకడం లేదన్నారు. దువ్వాడను చంపేందుకు తన కూతురేమైనా బాడీ బిల్డరా అని ప్రశ్నించారు. అయినా 60 ఏళ్ల వయసులో శ్రీనుకు ఇవేంపనులని రాఘవరావు నిలదీశారు.

‘‘సంవత్సరం నుంచి భార్యా బిడ్డలను వదిలేసి దువ్వాడ శ్రీను బయట తిరుగుతున్నారు. ఆయన తీరుతోనే మనస్పర్ధనలు వచ్చాయి. దువ్వాడ ఇల్లీగల్ వ్యవహారం అందరికీ తెలుసు. దువ్వాడ తండ్రి కృష్ణకు ఎలాంటి ఆస్తులు లేవు. రైల్వేలో పని చేసేవారు. రిటైర్డ్ తర్వాత చిన్న స్థలం కొన్నాడు. ’’ అని సంపతి రాఘవరావు తెలిపారు.

Tags:    

Similar News