ఆ కక్షతోనే నాపై కేసు పెట్టారు.. కోర్టులోనే తేల్చుకుంటా: మాధురి

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కామెంట్స్ చేశాననే కక్షతో తనపై కేసు పెట్టారని దివ్వెల మాధురి ఆరోపించారు....

Update: 2024-10-11 11:25 GMT

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Deputy CM Pawan Kalyan)పై కామెంట్స్ చేశాననే కక్షతో తనపై కేసు పెట్టారని దివ్వెల మాధురి(Divvela Madhuri) ఆరోపించారు. తిరుమల(Tirumala)లో రిల్సీ చేశారని కేసు నమోదు అయిన నేపథ్యంలో ఆమె స్పందించారు. అది తప్పుడు కేసు అని కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పారు. అందరిలాగే తాను, దువ్వాడ శ్రీను(Duvvada Srinu) తిరుపతి(Tirupati) వెళ్లామన్నారు. కొంతమంది మీడియా వాళ్లు తమ ఫోటోలు తీశారని, తాను తిరుమాడ వీధుల్లో(Tirumada Streets) రీల్స్ కానీ, ఫ్రీ వెడ్డింగ్ షూట్ కానీ చేయలేదని, అలా చేస్తే స్వామి వారి తమను శిక్షిస్తారని దివ్వెల మాధురి పేర్కొన్నారు. తమపై మాపై తప్పుడు ప్రచారం చేసిన వారిని ఆ స్వామి వారే శిక్ష వేస్తారని హెచ్చరించారు. రిల్స్, ఫ్రీ వెడ్డింగ్స్ జరిగితే ఆ ఫొటోలను చూపించాలని దివ్వెల మాధురి డిమాండ్ చేశారు. 


Similar News