పిఠాపురానికి పవన్ కల్యాణ్.. డిప్యూటీ సీఎం హోదాలో ఫస్ట్ టైమ్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. వచ్చే వారం పవన్ కల్యాణ్ పిఠాపురం

Update: 2024-06-22 14:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. వచ్చే వారం పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి పిఠాపురానికి వెళ్తున్న జనసేనాని.. మూడు రోజులపాటు సొంత ఇలాకాలో పర్యటన చేయనున్నారు. ఈ పర్యటన సందర్భంగా.. పిఠాపురంలోని స్థానిక సమస్యలు, పెండింగ్‌ ప్రాజెక్టులపై పవన్ సంబంధిత అధికారులతో సమీక్షించనున్నారు. ఈ మేరకు సమగ్ర సమాచారంతో సమావేశానికి రావాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు.

కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుండి బరిలోకి దిగిన పవన్ కల్యాణ్.. భారీ మెజార్టీతో విజయం సాధించారు. పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కూడా అఖండ విజయం సాధించింది. దీంతో టీడీపీ చీఫ్ చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం కొలువుదీరింది. ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కల్యాణ్.. ఏకంగా డిప్యూటీ సీఎం పదవి దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పవన్ కల్యాణ్ పిఠాపురంలో పర్యటించబోతున్నారు.


Similar News