‘చెట్లు నరకడం తేలిక..పెంచడమే కష్టం’..డిప్యూటీ సీఎం పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

విజయవాడలో నేడు(శుక్రవారం) వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ వన మహోత్సవానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హజరయ్యారు.

Update: 2024-08-30 12:03 GMT

దిశ,వెబ్‌డెస్క్:విజయవాడలో నేడు(శుక్రవారం) వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ వన మహోత్సవానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హజరయ్యారు. మొదటగా ఈ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించాలని అనుకున్నారు. కానీ అక్కడ భారీ వర్షం పడటం వల్ల ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా విజయవాడలో మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతంగా ప్రారంభించారు. పార్కులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేప, రావి మొక్కలను నాటారు, వాటికి నీరు కూడా పోయడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..వన మహోత్సవంలో కోటి మొక్కలు నాటాలి అని పిలుపునిచ్చారు. చెట్లు నరకడం తేలిక..పెంచడమే కష్టం అని పేర్కొన్నారు. పచ్చదనం పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉంది అన్నారు. భావితరాల కోసం అందరూ మొక్కలు నాటాలి అని పవన్ కళ్యాణ్ తెలిపారు.


Similar News