గురుకుల పాఠశాలలో విద్యార్థినుల అస్వస్థత పై డిప్యూటీ సీఎం ఆరా

కాకినాడ జిల్లా ఏలేశ్వరం లోని డా.బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకులంలో 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం పై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు.

Update: 2024-08-27 09:15 GMT

దిశ, ఏపీ బ్యూరో:కాకినాడ జిల్లా ఏలేశ్వరం లోని డా.బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకులంలో 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం పై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. సోమవారం ఉదయం నుంచి కడుపు నొప్పి, విరేచనాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం తెలియగానే కాకినాడ జిల్లా కలెక్టర్ తో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలందించే ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవాలని ఆదేశించారు. వీరికి చికిత్స నిమిత్తం ఏలేశ్వరం ఆసుపత్రికి స్పెషలిస్టులను పంపించాలన్నారు. గురుకులంలో విద్యార్థినులకు అందించిన ఆహారం, అక్కడి తాగు నీరు పరీక్షలు చేయించాలని ఆదేశించారు.


Similar News