విశాఖలో గంజాయి రవాణా చేసేది కొరియర్ బాయ్లే: సీపీ రవిశంకర్

విశాఖనగర పరిధిలో గంజాయి వ్యాపారం చేసేది వివిధ రకాల కొరియర్ సంస్థలకు చెందిన బాయ్ లేనని నగర పోలీస్ కమిషనర్ డా.రవిశంకర్ పేర్కొన్నారు.

Update: 2023-11-30 05:45 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖనగర పరిధిలో గంజాయి వ్యాపారం చేసేది వివిధ రకాల కొరియర్ సంస్థలకు చెందిన బాయ్ లేనని నగర పోలీస్ కమిషనర్ డా.రవిశంకర్ పేర్కొన్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి సిపి నేరుగా టూటౌన్ పరిధిలోని కొబ్బరి తోట ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రవాణాకి సిద్దంగా ఉంచిన 200 కేజిల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ...తమకు పక్కా సమాచారం రావడంతో దాడులు చేసినట్టు వెల్లడించారు. నగరంలో పలువురు కొరియర్ బాయ్ ల ద్వారా గంజాయి మెటీరియల్ రవాణా జరుగుతుందని అన్నారు. అలాంటి వారిపై నిఘా పెట్టామన్నారు. ప్రస్తుతం రవాణాకి పాల్పడుతున్నవారు పరారీలో ఉన్నారని వివరించారు. నగరంలోని ఏ కొరియర్ కంపెనీ అయినా నిబంధనలు అతిక్రమించి ఇలాంటి చట్ట వ్యతిరేక, నిషేధిత గంజాయిని రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని.. లోపలేస్తామని ఘాటుగా హెచ్చరించారు. ప్రస్తుతం అనుమానితులపై నిఘాపెట్టామని, నగరం మొత్తం వారి కోసం జల్లెడ పడుతున్నట్టు విశాఖ సీపీ వెల్లడించారు. ప్రస్తుతం గంజాయి స్వాధీనం చేసుకున్న ఇంటిలో వున్న వ్యక్తులు పలు రాష్ట్రాలు, ఇతర దేశాలకు కూడా ఇక్కడి నుంచే ఏడాదిన్న కాలంగా గంజాయి సరఫరా చేస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా గంజాయి గంజాయి రవాణా అవుతున్నట్టు సమాచారం వచ్చిందని అక్కడ కూడా ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహిస్తాయని తెలిపారు. నగరంలో ప్రజలు అద్దెకి ఇళ్లు ఇచ్చేవారు అద్దెకి దిగేవారి వివరాలను పూర్తిగా కనుక్కున్న తరువాత మాత్రమే ఇళ్లు అద్దెకి ఇవ్వాలని విశాఖ సీపీ డా.రవి శంకర్ సూచించారు.

Tags:    

Similar News