తిరుపతిలో దారుణం.. యువతి ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్

తిరుపతిలో కిలాడీ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు...

Update: 2024-07-26 17:21 GMT

దిశ, వెబ్ డెస్క్:  తిరుపతిలో కిలాడీ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలుకు చెందిన యువతిని ప్రణవ, కిషోర్ రెడ్డి భార్య భర్తలు ట్రాప్ చేశారు. తిరుపతిలో లా చదువుతున్న యువతితో భార్య పరిచయం చేసుకున్నారు. ఈ పరిచయంతో ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఇంటి వద్ద దారుణానికి పాల్పడ్డారు. మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ యువతికి ఇచ్చారు. కాసేపటికే యువతి మత్తులోకి వెళ్లిపోయింది. దీంతో భర్త కిషోర్‌తో యువతిపై భార్య లైంగిక దాడి చేయించింది. ఆ సమయంలో వీడియోలు తీశారు. అనంతరం యువతి అశ్లీల వీడియోలను కుటుంబ సభ్యులకు, కాబోయే భర్తకు పంపి రూ. 5 లక్షలు బ్లాక్ మెయిల్ చేశారు. రూ. 5 లక్షలు తీసుకున్నా వేధింపులు ఆగకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దంపతులు ప్రణవ, కిషోర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Tags:    

Similar News