ఈనెల 14న శ్రీకాకుళం జిల్లాకు సీఎం జగన్ : మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 14న జిల్లాలోని పలాస, కంచిలి మకరాంపురంలలో పర్యటిస్తున్నారని శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు.

Update: 2023-12-12 10:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 14న జిల్లాలోని పలాస, కంచిలి మకరాంపురంలలో పర్యటిస్తున్నారని శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేయాలని ధర్మాన ఓ ప్రకటనలో కోరారు. మకరాంపురంలో డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార ఉద్దానం మంచి నీటి ప్రాజెక్టుని, పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను సీఎం జగన్ ప్రారంభిస్తున్నారని తెలిపారు. అక్కడే 60 ఎకరాల్లో నిర్మించనున్న ఇండస్ట్రియల్ పార్కు కూడా శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.దశాబ్దాల తరబడి ఉన్న కిడ్నీ వ్యాధుల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపిన వైఎస్ జగన్‌కు అంతా అభినందనలు తెలియజేయాలని కోరారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు, ప్రజానీకం హాజరై విజయవంతం చేయాలని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కోరారు.

పాతపట్నం యాత్రకు తరలిరండి

మరోవైపు ఈనెల 13న పాతపత్ణంలో జరిగే సామాజిక సాధికార బస్సు యాత్రని కూడా జయప్రదం చేయాలని మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్ పిలుపునిచ్చారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పెద్ద ఎత్తున మేలు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపే ఈ కార్యక్రమానికి పాతపట్నం నియోజకవర్గంలోని శ్రేణులు అంతా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News