CM Chandrababu: రేపు తిరుమలకు సీఎం చంద్రబాబు.. ప్రధాన కారణం అదే!

సీఎం చంద్రబాబు నాయుడు (CM Chadrababu Nayudu) రేపు కుటుంబ సమేతంగా తిరుమల (Tirumala)కు వెళ్లనున్నారు.

Update: 2024-10-03 08:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు (CM Chadrababu Nayudu) రేపు కుటుంబ సమేతంగా తిరుమల (Tirumala)కు వెళ్లనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయన స్వామి వారికి రాష్ర్ట ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలను సమర్పించనున్నారు. శుక్రవారం సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి సాయంత్రం 6 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. ముందుగా ఆయన భార్య భువనేశ్వరితో కలిసి బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టు వస్ర్తాలతో తీసుకుని ఊరేగింపుగా శ్రీవారి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. అనంతరం కాసేపు ఆలయంలోనే వారు గడపనున్నారు. అదేవిధంగా 2025 వార్షిక సంవత్సరం క్యాలెండర్లను టీటీడీ (TTD) అధికారుల సమక్షంలో సీఎం చంద్రబాబు ఆవిష్కరిస్తారు. శనివారం ఉదయం 7.35క వకుళా మాత వంటశాలను ప్రారంభిస్తారు. అనంతరం సీఎం నేరుగా తిరుమల నుంచి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు అక్కడి నుంచి విజయవాడకు చేరుకుంటారు.   


Similar News