CM CHANDRABABU: రైతులకు భారీ గుడ్న్యుస్ అందించిన సీఎం చంద్రబాబు.. తేదీ ఖరారు
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పాలనపై దృష్టి సారించారు.
దిశ, వెబ్డెస్క్: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పాలనపై దృష్టి సారించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మేరకు వరుసగా నెరవేర్చుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అమరావతి రైతులకు ఓ భారీ శుభవార్త అందించారు.
ఐదేళ్లుగా ప్రతి ఏడాదీ కౌలు కోసం హైకోర్టును ఆశ్రయించిన రైతులకు ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా నేరుగా కౌలు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే నెల 15 కల్లా అమరావతి రైతులకు ఇవ్వాల్సిన వార్షిక కౌలును విడుదల చేస్తామని ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్ మంత్రి నారాయణ సమాచారం ఇచ్చారు.
అమరావతి రైతులకు ఈ ఏడాది ఇవ్వాల్సిన కౌలు మొత్తాన్ని విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించినట్లు మున్సిపల్ మంత్రి నారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రైతుల సమస్యల పరిష్కారానికి సైతం సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో వచ్చే నెల 15 కల్లా రైతుల ఖాతాల్లోకి నేరుగా ఈ కౌలు మొత్తం జమ కానుంది. గతంలో అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఏటా వార్షిక కౌలును ప్రభుత్వం చెల్లిస్తోంది.