CM Chandrababu: బుడమేరు గండ్ల పాపం గత ప్రభుత్వానిదే: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

బుడమేరుకు గండ్ల పాపం గత వైసీపీ ప్రభుత్వానిదేనని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-10 12:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: బుడమేరుకు గండ్ల పాపం గత వైసీపీ ప్రభుత్వానిదేనని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.మంగళవారం ఆయన బుడమేరకు గండ్లు పడిన ప్రాంతాన్ని మంత్రి నిమ్మల రామానాయుడితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం బుడమేరును పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు, వరదలు వచ్చాయని తెలిపారు. బుడమేరుకు పడిన గండ్లను పూడ్చేందుకు కొన్ని రోజుల నుంచి శ్రమిస్తూనే ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో బుడమేరు పెద్ద ఎత్తున కబ్జాలకు గురైందని.. ఆ కారణంగానే విజయవాడ పట్టణం వరదలతో అతలాకుతలమైందని తెలిపారు.


Similar News