CM Chandrababu: పెళ్లి రోజైనా వరద సహాయక చర్యల్లోనే సీఎం చంద్రబాబు.. సర్‌ప్రైజ్ ఇచ్చిన భువనేశ్వరి

విజయవాడలో బుడమేరు సృష్టించిన బీభత్సం వేల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.

Update: 2024-09-10 11:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో బుడమేరు సృష్టించిన బీభత్సం వేల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. వరదల ధాటికి పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. దీంతో ప్రజలంతా ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ప్రభుత్వ యంత్రాంగం వరద సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఇక సీఎం చంద్రబాబు వరదలను సైతం లెక్క చేయకుండా గత 10 రోజుల నుంచి ప్రతి కాలనీలో తిరుగుతూ ప్రజలకు ధైర్య చెబుతున్నారు. పని ఒత్తిడి కారణంగా ప్రజా సేవలకే అంకితం అయన ఇంటికి వెళ్లకుండా విజయవాడ కలెక్టరేట్లో బస చేస్తున్నారు.

ఇవాళ చంద్రబాబు, భువనేశ్వరిల పెళ్లి రోజు అయినా సీఎం వరద సహాయక చర్యల్లోనే తలమునకలై ఉన్నారు. దీంతో భర్తను కలిసేందుకు భువనేశ్వరి కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ధర్మపత్ని భువనేశ్వరితో సీఎం చంద్రబాబు కాసేపు ముచ్చటించారు. అనంతరం తిరిగి ఆయన పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ వెంటనే అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌ కూడా నిర్వహించారు. కాగా, గత పెళ్లి రోజున చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈసారి ఆయన వరద సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.


Similar News