సీతారాం ఏచూరి మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సంతాపం

ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సీపీఐఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Update: 2024-09-12 11:52 GMT

దిశ,వెబ్‌డెస్క్: ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సీపీఐఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. అట్టడుగు వర్గాల ప్రజలతో సీతారాం ఏచూరికి మంచి అనుబంధం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. భారతదేశ రాజకీయాల్లో ఆయన అత్యంత గౌరవనీయ వ్యక్తి అని చంద్రబాబు అభివర్ణించారు. సీతారాం ఏచూరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని తెలిపారు.

ఈ క్రమంలో వామపక్ష దిగ్గజం సీతారాం ఏచూరి మృతి పట్ల ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. సీతారాం ఏచూరి మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ఏచూరి మరణంతో ఒక ప్రజా పోరాట యోధుడని కోల్పోయామని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలకే తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి సీతారాం ఏచూరి అని కొనియాడారు. ఏచూరికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నానని లోకేష్ పేర్కొన్నారు.


Similar News