Ap: పలమనేరులో ఉద్రిక్తత
చిత్తూరు జిల్లా పలమనేరులో టెన్షన్ వాతావరణం నెలకొంది...
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా(Chittoordistrict)పలమనేరు(Palamaneru)లో టెన్షన్ వాతావరణం నెలకొంది. రఘువీరారెడ్డి కాలనీ(Raghuveera Reddy Colony)లో విద్యార్థుల(Students) మధ్య గొడవ చెలరేగింది. ఈ మేరకు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో స్టూడెంట్స్కు స్థానికుల మధ్య సైతం ఘర్షణ జరిగింది. దీంతో విద్యార్థులపై స్థానికులు దాడి చేశారు. అయితే ఈ దాడి సమాచారం తెలుసుకుని గ్రామానికి వెళ్లడంతో పోలీసులుపైనా కాలనీవాసులు తిరగబడ్డారు. ఈ క్రమంలో కాలనీవాసులకు, పోలీసులకు మధ్య సైతం వాగ్వాదం జరిగింది. దీంతో ఇరు వర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. మరోసారి ఘర్షణలు చెలరేగకుండా ప్రతిష్ట ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఘర్షణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.