‘వర్షంలో సాహస శవయాత్ర’.. ఆ గ్రామ ప్రజల బాధ వర్ణనాతీతం

వర్షం వస్తే సాహస శవయాత్ర చేయాల్సిందే ఆ గ్రామంలో బ్రిడ్జి ప్రతిపాదన కాగితాలకే పరిమితం అవుతోందని తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదంటున్నారు ఆ గ్రామస్తులు.

Update: 2024-10-16 12:59 GMT

దిశ ప్రతినిధి,తిరుపతి: వర్షం వస్తే సాహస శవయాత్ర చేయాల్సిందే ఆ గ్రామంలో బ్రిడ్జి ప్రతిపాదన కాగితాలకే పరిమితం అవుతోందని తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదంటున్నారు ఆ గ్రామస్తులు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సూటుపల్లి పంచాయతీ కస్తూరి నాయుడు కండ్రిగ ప్రజలకు ప్రతి సంవత్సరం వర్షం వస్తే సాహస శవయాత్ర అనుభవంగా మారుతుంది. తుఫాను నేపథ్యంలో అరుణానదికి సంబంధించిన కాలువకు వరద నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ఈ క్రమంలో గ్రామంలో శంకర్ అనే వ్యక్తి మృతి చెందాడు. దాహన క్రియల కోసం మృతదేహాన్ని ప్రమాదకర ప్రవాహంలో నడుము లోతు నీటిలో తీసుకెల్లి దహనం చేశారు. దీంతో సురుటపల్లి గ్రామ ప్రజలు వంతెన ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం లేదంటున్నారు.


Similar News