Pileru: మసీదుల అభివృద్ధికి ఎంపీ మిథున్ రెడ్డి నిధులు

ఎంపీ లాడ్స్ నుంచి పీలేరు నియోజకర్గం వాల్మీకిపురంలో 9 మసీదుల అభివృద్ధికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రూ. 37 లక్షలు మంజూరు చేశారు...

Update: 2023-09-29 17:17 GMT

దిశ, పీలేరు: ఎంపీ లాడ్స్ నుంచి పీలేరు నియోజకర్గం వాల్మీకిపురంలో 9 మసీదుల అభివృద్ధికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రూ. 37 లక్షలు మంజూరు చేశారు. పలు మసీదులను సందర్శించి ఆయా మసీదుల ముతవల్లిలకు చెక్ లను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ముస్లింల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ ఇబ్బాల్ అహమద్, ఏపీ ఎం డి సి డైరెక్టర్ హరీష్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ కలీం, పరిశీలకుడు సహదేవ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.


Similar News