సింహాచలం దేవస్థానంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లాలో పర్యటించారు.

Update: 2023-12-03 09:59 GMT

దిశ , డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లాలో పర్యటించారు. విశాఖలోని సింహాచలం దేవస్థానాన్ని చంద్రబాబు నాయుడు సతీసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చంద్రబాబు నాయుడు దంపతులకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు నాయుడు సింహాచలం అప్పనస్వామికి మెుక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే దేవుడు వరాహ లక్ష్మీనరసింహ స్వామి అని చంద్రబాబు నాయుడు అన్నారు. కష్టాల్లో ఉన్నవారిని.. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే వరాహ లక్ష్మీనరసింహ స్వామిని పూజలు చేసి మెుక్కులు చెల్లించుకున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు.

Tags:    

Similar News